Tirumala : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో అతిథి గృహం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.

Tirumala : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో అతిథి గృహం

Tirumala (1)

Tirumala Guest House : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. తిరుమల సన్నిధిలో మరో అతిథి గృహం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఫోనిక్స్ పవర్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ తిరుమలలోని సన్నిధానం అతిథి గృహం సమీపంలో నిర్మించిన వేంకటేశ్వర అతిథి గృహాన్ని దాతలు గురువారం టీటీడీకి అప్పగించారు.

ఈ మేరకు 12 గదులతో నిర్మించిన ఈ అతిథి గృహం తాళం చెవులను దాతలు సురేష్ చుక్కపల్లి కుటుంబ సభ్యులు రమేష్ చుక్కపల్లి, అవినాష్ చుక్కపల్లి, గోపికృష్ణ.. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓస్డీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం.. వాటిలో మార్పులు

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. దీంతో కొండపై ఉన్న కంపార్ట్ మెంట్లలో 14 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న (బుధవారం) శ్రీవారిని 80 వేల 284 మంది దర్శించుకోగా 34 వేల 96 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

భక్తులు సమర్పించుకున్న కానుల ద్వారా హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చిందని వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.