ఏపీలో మరో శిరోముండనం కేసు

  • Published By: murthy ,Published On : October 5, 2020 / 12:35 PM IST
ఏపీలో మరో శిరోముండనం కేసు

Another Tonsuring Case: విశాఖలో సినీ నిర్మాత నూతన్ నాయుడ ఇంట్లో శిరోముండనం కేసు మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో శిరోముండనం కేసు నమోదయ్యింది. తీసుకున్న అప్పు తీర్చటంలేదని నలుగురు వ్యక్తులు, అప్పతీసుకున్న వ్యక్తికి శిరోముండనం చేసిన ఘటన వెలుగు చూసింది.

జిల్లాలోని తాడేపల్లి గూడెం కు చెందిన అలక అభిలాష్(23) అనే యువకుడు జంగారెడ్డి గూడెంకు చెందిన యర్రసాని విజయ్ బాబు అనే వ్యక్తి వద్ద మూడు నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పు తీర్చమని గత 3 రోజులుగా విజయ్ బాబు అభిలాష్ ను కోరుతున్నాడు.


ఇదే విషయమై అడగటానికి అక్టోబర్ 3వ తేదీ రాత్రి విజయ్ తన మిత్రులు షేక్ నాగుల్ మీరావలి, కంకిరెడ్డి మార్కండేయులుతో కలిసి తాడేపల్లి గూడెంలోని అభిలాష్ ఇంటికి వచ్చారు. అక్కడ అభిలాష్ ను డబ్బు విషయం మాట్లాడదాం రమ్మనమని చెప్పి…కారులో ఎక్కించుకుని నేరుగా జంగారెడ్డి గూడెం గంగానమ్మ లే అవుట్ లోని ఒక ఇంటికి తీసుకు వచ్చారు.

బాధితుడు అభిలాష్tonsuring case at wg distఅప్పు తీర్చ లేక పోయినందుకు అభిలాష్ కు శిరోముండనం చేయించారు. అనంతరం బాధితుడిని ఆర్టీసి బస్టాండ్ వద్ద వదిలేసి వెళ్ళిపోయారు. బాధితుడు అభిలాష్ జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితులు విజయ్ బాబు, షేక్ నాగూర్ మీరావలి, మార్కండేయులు పై ఐపీసీ సెక్షన్ 352,363,342,323,506 r/w 34 ల క్రింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.