TDPలో మరో వికెట్ : YCPలోకి పరిటాల అనుచరుడు, ఎమ్మెల్సీ

  • Published By: madhu ,Published On : January 24, 2020 / 08:03 AM IST
TDPలో మరో వికెట్ : YCPలోకి పరిటాల అనుచరుడు, ఎమ్మెల్సీ

TDPకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి పలువురు చేజారిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరుడు పోతుల సురేష్, ఆయన సతీమణి ఎమ్మెల్సీ సునీత పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేశారు పోతుల సురేష్. సునీత ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

కానీ..మూడు రాజధానులకు అనుకూలంగా ఎమ్మెల్సీ సునీత ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో వారు పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం వారు 10tvతో మాట్లాడారు. ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉండొద్దని, అందుకే తాను ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సపోర్టు ఇవ్వడం జరిగిందన్నారు సునీత.

అభివృద్ధి ఒకే ప్రాంతం వద్ద కేంద్రీకరిస్తే..ఇతర ప్రాంతాలు అభివృద్ధి అవుతాయా ? అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, పదవి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యినందుకు ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయని తెలిపారు పోతుల సురేష్. మూడు రాజధానులను సమర్థించాల్సి వచ్చిందని, సీఎం జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తమను ఎంతగానో ఆకర్షించాయన్నారు. అందుకే తాము వైసీపీలో చేరాల్సి వస్తోందన్నారు. 

Read More : పవన్‌కు సిద్ధాంతం, వ్యక్తిత్వం ఉన్నాయా ? 5 సంవత్సరాల్లో 6 పార్టీలతో పొత్తులు