AP Covid : 24 గంటల్లో 1,843 కరోనా కేసులు, 12 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో వేయి 843 మందికి కరోనా సోకింది. 12 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 23 వేల 571 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

AP Covid : 24 గంటల్లో 1,843 కరోనా కేసులు, 12 మంది మృతి

Ap Corona cases

AP New Covid Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో వేయి 843 మందికి కరోనా సోకింది. 12 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 23 వేల 571 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 199 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో కరోనాతో ముగ్గురు చనిపోయారు. చిత్తూరు, తూ.గో, కర్నూలు, నెల్లూరులో ఇద్దరు చొప్పున కరోనా మృతి చెందారు. చిత్తూరులో 301, ప.గో.జిల్లాలో 235 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :- 
ప్రకాశంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, కృష్ణాలో ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 69. చిత్తూరు 301. ఈస్ట్ గోదావరి 222. గుంటూరు 126. వైఎస్ఆర్ కడప 128. కృష్ణా 157. కర్నూలు 24. నెల్లూరు 203. ప్రకాశం 232. శ్రీకాకుళం 33. విశాఖపట్టణం 84. విజయనగరం 29. వెస్ట్ గోదావరి 235. మొత్తం : 1,843