AP Crime : యువకుడు హత్య..మృతదేహాన్ని ముక్కలుగా కోసి..దహనం

తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువకుడు హత్య..మృతదేహాన్ని ముక్కలుగా కోసి..దహనం చేసిన ఘటనతో గ్రామం అంతా భయాందోళనకు గురైంది.

AP Crime : యువకుడు హత్య..మృతదేహాన్ని ముక్కలుగా కోసి..దహనం

Ap Crime

AP Crime : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత పాశవిక ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని అత్యంత దారుణగా హత్య చేసి..బాత్రూమ్ లో తుగుపెట్టే యత్నంచేశారు. దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దారుణం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొల్లాపూర్ లో ఒక యువకుడి హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. నవంబరు 24వ తేదీన నాగ సాయి అలియాస్ వెంకటేష్ లనే 25 సంవత్సరాల యువకుడిని నలుగురు కలిసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని పోలీసులు నాగ సాయి అలియాస్ వెంకటేష్ గా గుర్తించారు.

నాగసాయిని హత్య చేసిన తరువాత దుండగులు దొరకుండా మృతదేహాన్ని మాయం చేద్దామనుకున్నారు. దాని కోసం మృతదేహాన్ని ముక్కలు చేశారు. రోజుకో అవయవాన్ని దహనం చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఈక్రమంలో బాత్రూమ్ లో ఓ అవయవాన్ని దహనం చేస్తుండగా దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు.దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గుట్టు రట్టు చేశారు.

నాగసాయి మృతదేహాన్ని ముక్కలుగా చేసి, రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్న విషయం వెలుగులోకి రావడంతో కోలమూరు వాసులు షాక్ కు గురయ్యారు. ప్రతిరోజు అతని శరీర భాగాలను దహనం చేయడంతో దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇది బయటపడింది. సగం కాలిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నాగసాయి అనే యువకుడిని హత్య చేసి..శరీర భాగాలను ముక్కలుగా చేసి, రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్నట్లుగా రాజనగరం పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఈ హత్య కేసులో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మర్డర్ చేసిన వ్యక్తులు ఎవరు? ఎందుకు చేశారు? మృతుడికి వీరికి శతృత్వం ఏమిటి? ఏ విషయంలో వివాదం వచ్చింది? హత్య చేసేంత కారణం ఏమిటి? వ్యక్తిగత తగాదాలా? లేక ప్రేమ వ్యవహారమా?అనే కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదీ కాకుంటే ఆస్తి పంచాయితీలా ?

నాగసాయి హత్య..తదనంతరం జరిగిన ఘటనలతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. మృతదేహాన్ని అత్యంత కర్కశంగా ముక్కలు కోసి, రోజుకో ముక్క చొప్పున దహనం చేస్తున్నారంటే దీని వెనుక ఏదో గట్టి కారణమే ఉందని భావిస్తున్నారు పోలీసులు. కాగా ఇంతటి రాక్షసత్వంతో మృతదేహాన్ని ముక్కులుగా కోసి కాలుస్తున్నారు అంటే వీళ్లు మనుషుల రాక్షసులా? అని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.