Thota Chandrasekhar: దర్యాప్తు సంస్థల వేధింపులకు బీఆర్ఎస్ భయపడదు.. కవితపై ఈడీ కేసులు కక్షపూరిత చర్యే
దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని బీజేపీ భావిస్తోందని, దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరిగా ప్రతిపక్షాలపైకి వదిలిందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thota Chandrasekhar: దర్యాప్తు సంస్థల వేధింపులకు బీఆర్ఎస్ భయపడదని, బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఎదుగుతుందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థల్ని ప్రేరేపిస్తుందని, ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. బీజేపీకి జాతీయ స్థాయిలో బీఅర్ఎస్ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతుందని, అన్ని శక్తులను ఐక్యం చేసేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Thota Chandrasekhar : ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్, సంక్రాంతి తర్వాత మరింత దూకుడు
దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని బీజేపీ భావిస్తోందని, దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరిగా ప్రతిపక్షాలపైకి వదిలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థల వేధింపులకు బీఅర్యస్ బయపడదని, కవితపై ఈడీ కేసులు కక్ష పూరిత చర్యేనని అన్నారు. రాష్ట్ర విభజనలో తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసిందని, విభజన హామీలు అమలు చేయకుండా ఏపీకి అన్యాయం చేశారని అన్నారు. పోలవరం, ప్రత్యెక హోదా విషయంలో కేంద్రంలోని బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడుగుతున్నారని, ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన కడప స్టీల్ ప్లాంట్, విజయవాడ మెట్రో, పెట్రో కెమికల్ కారిడార్ హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు.
ఏపీకి పదేళ్లుగా హోదా ఇస్తామన్న ప్రధాని హామీ ఏమైందని చంద్రశేఖర్ ప్రశ్నించారు. బీజేపీకి చిత్తశుద్ధి లేదని, కాబట్టి ఏపి అభివృద్ధికి సహకారం అందించడం లేదన్నారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా పోరాటం చేయడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందన్నారు. బీజేపీని ఎదుర్కోవడం బీఅర్ఎస్కు మాత్రమే సాధ్యం అవుతుందని అన్నారు. రాజకీయ నిరుద్యోగులు మాత్రమే బిజేపీలో చేరుతున్నారని విమర్శించిన ఆయన, ఏపీలో త్వరలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు. టీడీపీ, వైసీపీలు ఏపికి అన్యాయం చేశాయని, ఏపిలో పెట్టుబడుల పేరుతో గతంలో టీడీపీ మోసం చేసిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంకూడా అదే తప్పు చేస్తుందని అన్నారు. పెట్టుబడి దారులకు నమ్మకం కలిగించడంలో ఏపీలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. ఏపీలో అన్ని అసెంబ్లీ నియోజవర్గాలు, ఎంపి స్థానాల్లో బీఅర్ఎస్ అభ్యర్థులను నిలుపుతామని చంద్రశేఖర్ చెప్పారు.