AP Capital: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని అన్నారు మేకపాటి గౌతం రెడ్డి. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో...

AP Capital: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని

Ap Capital

AP Capital: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని అన్నారు మేకపాటి గౌతం రెడ్డి. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామితో కలిసి పాల్గొన్నారు. అది పులివెందుల కావొచ్చు. విజయవాడ కావొచ్చు.. రేపు మరో ప్రాంతం కావొచ్చు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియేట్. అదే రాజధాని అన్న మంత్రి మేకపాటి.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.

చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని వెల్లడించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరిస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేసి చర్యలు చేపట్టాం. ఏపీకి కొత్త పరిశ్రమలు రానున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.