CM Jagan Tirumala Tour: 27న తిరుమలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ..
CM Jagan Tirumala Tour: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 27న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. 27న రాత్రి 7గంటలకు సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవల్లో పాల్గొంటారని తెలిపారు.
ఈనెల 28వ తేదీన ఉదయం పరకామణి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రారంభించనున్నారు. అధునాతన సౌకర్యాలు, పటిష్టమైన భద్రతతో మొత్తం 26 కోట్లతో పరకామణి భవనం నిర్మిస్తున్నారు. ఈ భవనంలో కానుకల లెక్కింపును భక్తులు వీక్షించేందుకు రెండువైపులా అద్దాలు ఏర్పాటు చేశామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. 2.5 కోట్లు విలువ గల చిల్లర నాణేలు వేరు చేసే యంత్రాన్ని దాత విరాళమిస్తున్నారని. ఈ యంత్రం ద్వారా 13 రకాల నాణేలను యంత్రం సెగ్రిగేషన్ చేయవచ్చని తెలిపారు. శ్రీవారి ఆలయం వెలుపల నూతన పరకామణి వాడుకలోకి వచ్చిన అనంతరం.. ఆలయంలోని పాత పరకామణిలో లెక్కింపు నిలిపివేస్తామని చెప్పారు.