YS Jagan Mohan Reddy : గవర్నర్‌తో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ దంపతులను కలిశారు. సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు.

YS Jagan Mohan Reddy : గవర్నర్‌తో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

Cm Ys Jagan With Governor

YS Jagan Mohan Reddy :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ దంపతులను కలిశారు. సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట సీఎం కార్యక్రమాల సమన్వయ కర్త, శాసనమండలి సభ్యుడు తలశిల రఘురాం, సీఎంఓ కు చెందిన ఇతర అధికారులు ఉన్నారు.

గవర్నర్ బిశ్వభూషణ్ తన ఢిల్లీ పర్యటను ముగించుకుని మంగళవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో గవర్నర్ రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు.

ఈ పర్యటనలో గవర్నర్…. రాష్ట్రంలో పరిపాలన, ఆర్థిక పరిస్ధితులపై మోదీకి నివేదిక ఇచ్చారనే వార్త ప్రచారం జరిగిన నేపథ్యంలో వీరి భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.

Also Read : Gunturu : గుంటూరు జిల్లాలో మహిళ హత్య