కడప జిల్లాలో జగన్ పర్యటన

  • Published By: murthy ,Published On : July 6, 2020 / 12:43 PM IST
కడప జిల్లాలో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఇడుపులపాయకు వెళ్తున్నారు. కడప జిల్లా పర్యటనలో ఆయన పలు అభివృధ్ది కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు.

సీఎం పర్యటన షెడ్యూల్
> 7వ తేదీ మ.3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయల్దేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో కడపకు బయల్దేరుతారు.
> సాయంత్రం కడప విమానాశ్రయంలో దిగి.. హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకుంటారు.
> రాత్రికి ఇడుపులపాయ అతిథిగృహంలో బస చేస్తారు.

8వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు.
> అనంతరం వైఎస్సార్‌ సర్కిల్, ఆర్‌.కె.వ్యాలీ వద్ద ఆర్‌జీయూకేటీకి చేరుకుని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం.
> 3 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ అతిథి గృహానికి వెళ్తారు.
> మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి వెళ్లి అక్కడి∙నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

Read Here>>ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే…