AP : 24 గంటల్లో 1,747 కరోనా కేసులు, 14 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో వేయి 747 మందికి కరోనా సోకింది. 14 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 22 వేల 939 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

AP : 24 గంటల్లో 1,747 కరోనా కేసులు, 14 మంది మృతి

Ap Corona

AP Corona : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో వేయి 747 మందికి కరోనా సోకింది. 14 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 22 వేల 939 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 13 వేల 223 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 365 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు కరోనాతో చనిపోయారు.

Read More : Guru Pournami 2021 : గురి పూర్ణిమ విశిష్టత

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
చిత్తూరులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, విశాఖపట్టణంలో ఒక్కరు మృతి చెందారు.

Read More : Mother Murdered : తల్లిని చంపి..రక్తంలో ఆడుకున్న ఇద్దరు కూతుళ్లు..

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 45. చిత్తూరు 293. ఈస్ట్ గోదావరి 234. గుంటూరు 86. వైఎస్ఆర్ కడప 54. కృష్ణా 127. కర్నూలు 09. నెల్లూరు 239. ప్రకాశం 223. శ్రీకాకుళం 82. విశాఖపట్టణం 109. విజయనగరం 31. వెస్ట్ గోదావరి 215. మొత్తం : 1,747