AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..
ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వం విధించిన కర్ప్యూ ఫలితాలిస్తోంది.
AP Corona : ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వం విధించిన కర్ప్యూ ఫలితాలిస్తోంది. గడిచిన 24 గంటల్లో 81,740 శాంపుల్ పరీక్షించగా 2వేల 345 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 508, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు.. అనంతపురం జిల్లాలో 52, చిత్తూరు జిల్లాలో 332, తూర్పుగోదావరి జిల్లాలో 508, గుంటూరు జిల్లాలో 121, కడప జిల్లాలో 84, కృష్ణా జిల్లాలో 238, కర్నూలు జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 228, ప్రకాశం జిల్లాలో 243, శ్రీకాకుళం జిల్లాలో 95, విశాఖపట్నం జిల్లాలో 150, విజయనగరం జిల్లాలో 36, పశ్చిమగోదావరి జిల్లాలో 229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో మరో 3,001 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 16మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,34,450కి చేరింది. 18,96,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 24వేల 854కి తగ్గింది. కరోనా మృతుల సంఖ్య 13,097కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,33,96,437 శాంపిల్స్ పరీక్షించారు.
#COVIDUpdates: 16/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,31,555 పాజిటివ్ కేసు లకు గాను
*18,93,604 మంది డిశ్చార్జ్ కాగా
*13,097 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 24,854#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/AW4yJjXL9Q— ArogyaAndhra (@ArogyaAndhra) July 16, 2021