AP Corona Cases : ఏపీలో కాస్త పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త ఎక్కువగా నమోదయ్యాయి.
AP Corona Cases : రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త ఎక్కువగా నమోదయ్యాయి. టెస్టుల సంఖ్య పెరగడమే దీనికి కారణం అని అధికారులు అంటున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91 వేల 594 శాంపుల్స్ ని పరీక్షించగా 2వేల 672 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 18మంది కరోనాతో మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 13,115కి చేరింది. గడచిన 24 గంటల్లో 2వేల 467 మంది డిశ్చార్జ్ అయ్యారు.
జిల్లాల వారిగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 73, చిత్తూరు జిల్లాలో 372, తూర్పుగోదావరి జిల్లాలో 504, గుంటూరు జిల్లాలో 225, కడప జిల్లాలో 149, కృష్ణాజిల్లాలో 257, కర్నూలు జిల్లాలో 21, నెల్లూరు జిల్లాలో 288, ప్రకాశం జిల్లాలో 315, శ్రీకాకుళం జిల్లాలో 35, విశాఖపట్నం జిల్లాలో 111, విజయనగరం జిల్లాలో 30, పశ్చిమగోదావరి జిల్లాలో 292 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19,34,450కి చేరింది. ఇప్పటివరకు 18,96,499 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 25, 041గా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,33,96,437 శాంపిల్స్ పరీక్షించారు.
#COVIDUpdates: 17/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,34,227 పాజిటివ్ కేసు లకు గాను
*18,96,071 మంది డిశ్చార్జ్ కాగా
*13,115 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,041#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/78XlQemt4X— ArogyaAndhra (@ArogyaAndhra) July 17, 2021