AP Corona : రిలీఫ్.. ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. 3వేల లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో
AP Corona : ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. 3వేల లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 90వేల 532 కరోనా పరీక్షలు చేయగా 2వేల 930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 591 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 59 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో రాష్ట్రంలో 4వేల 346 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 36మంది కోవిడ్ తో మరణించారు. మిగతా జిల్లాలతో పోల్చితే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు కోవిడ్ తో చనిపోయారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 12వేల 815కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 18,99,748 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 18,51,062 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 35,871కి తగ్గింది.
#COVIDUpdates: 03/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,96,853 పాజిటివ్ కేసు లకు గాను
*18,48,167 మంది డిశ్చార్జ్ కాగా
*12,815 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 35,871#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ZUNIMiULPg— ArogyaAndhra (@ArogyaAndhra) July 3, 2021