పెరుగుతున్న రికవరీ శాతం.. శనివారం కరోనా పాజిటివ్ 667మాత్రమే

పెరుగుతున్న రికవరీ శాతం.. శనివారం కరోనా పాజిటివ్ 667మాత్రమే

ఆంధ్రప్రదేశ్‍‌లో కరోనా పాజిటివ్ సంఖ్య క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. శనివారం రోజు మొత్తంలో 60వేల 329మందికి జరిపిన టెస్టుల్లో అన్ని రకాల శాంపుల్స్ కలిపి 667మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ కోవిడ్ కారణంగా చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు మృతి చెందినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే గడిచిన 24గంటల్లో కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 914గా నమోదైంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ కోటి 4లక్షల 10వేల 612మంది శాంపుల్స్ పరీక్షించారు.