AP Corona : ఏపీలో తగ్గని కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల్లో 64వేల 550 నమూనాలు పరీక్షించగా 1557 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123
AP Corona : ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల్లో 64వేల 550 నమూనాలు పరీక్షించగా 1557 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 18మంది మృతిచెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,825కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1213 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,83,119కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,179 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నేటివరకు రాష్ట్రంలో 2,65,35,822 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారు. చిత్తూరులో 255, తూర్పు గోదావరిలో 232, కృష్ణాజిల్లాలో 159, నెల్లూరులో 164, పశ్చిమ గోదావరి జిల్లాలో 212 కేసులు నమోదయ్యాయి.
కరోనా తీవ్రత కొనసాగుతుందన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.
#COVIDUpdates: 29/08/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,09,228 పాజిటివ్ కేసు లకు గాను
*19,80,224 మంది డిశ్చార్జ్ కాగా
*13,825 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,179#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gU8esNmNEZ— ArogyaAndhra (@ArogyaAndhra) August 29, 2021