AP Covid-19 Cases : ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు, నలుగురు మృతి
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో నలుగురు మృతిచెందగా 456 మంది కోలుకున్నారు.
Covid-19 Positive Cases in Andhra Pradesh : ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో నలుగురు మృతిచెందగా 456 మంది కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసు సంఖ్య 8,99,094కి చేరింది. రాష్ట్రంలో కరోనా 7,338 యాక్టివ్ కేసులుండగా.. 7,217 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 30,964 శాంపిళ్లను పరీక్షించారు.
ఇప్పటివరకు 1,50,83,179 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్ వల్ల చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఒకరు మరణించారు. గుంటూరు జిల్లాలో 352, విశాఖ జిల్లాలో 186 కేసులు నమోదుకాగా, చిత్తూరు 115, కృష్ణా 113, నెల్లూరు జిల్లాల్లో 78 కేసులు నమోదు అయ్యాయి.
#COVIDUpdates: 31/03/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,99,094 పాజిటివ్ కేసు లకు గాను
*8,84,539 మంది డిశ్చార్జ్ కాగా
*7,217 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,338#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/LEV0S1fDkz— ArogyaAndhra (@ArogyaAndhra) March 31, 2021