ఏపీ కొవిడ్ కేసుల్లో స్వల్ప ఊరట

ఏపీ కొవిడ్ కేసుల్లో స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా నమోదవుతున్న కేసుల అంకెల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. 10వేలు ధాటి ఫైల్ అవుతున్న కేసుల్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం 9గంటల వరకూ నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 57వేల 148మంది శాంపిల్స్ పరీక్షించగా 9వేల 597మందికి కొవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కొవిడ్ వల్ల గుంటూరులో పదమూడు మంది, ప్రకాశంలో పదకొండు మంది, చిత్తూర్ లో పది మంది, నెల్లూరులో పది మంది, శ్రీకాకుళంలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఏడుగురు, కడపలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

కోలుకున్న వారి విషయానికొస్తే.. 24గంటల్లో 6వేల 676మంది పూర్తిగా కోలుకున్నారు. బుధవారం ఉదయం వరకూ పరీక్షించిన శాంపుల్స్ ను బట్టి మొత్తం 26లక్షల 49వేల 767మందిని పరీక్షించారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

గడిచిన 24గంటల్లో కొవిడ్ కేసుల వివరాలు: