AP DGP Gautam : కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : ఏపీ డీజీపీ
కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.
AP DGP Gautam Sawang : కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అత్యవసరంగా ప్రయాణించే వారి కోసం రేపటి నుంచి ఈ-పాస్ విధానం అమలు చేస్తామని చెప్పారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ, క్రమ శిక్షణ పాటించాలని సూచించారు.
కర్ప్యూ కారణంగా ఏపీ పోలీసులు నిర్ణయించారు. విజయవాడలో సవాంగ్ ఆకస్మికంగా పర్యటించి కర్ఫ్యూ అమలును పరిశీలించారు. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి బయటకువ వచ్చేవారి వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు.