‘నాకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి’.. కేంద్రహోంశాఖకు ఈసీ రాశారంటున్న లేఖపై గందరగోళం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖతో ఆంధ్రప్రదేశ్‌లో గందరగోళం నెలకొంది. ఎలక్షన్ కమిషనర్ రమేశ్‌కుమార్ పేరుతో మీడియాకు ఆ లేఖ అందింది.

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 01:58 PM IST
‘నాకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి’.. కేంద్రహోంశాఖకు ఈసీ రాశారంటున్న లేఖపై గందరగోళం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖతో ఆంధ్రప్రదేశ్‌లో గందరగోళం నెలకొంది. ఎలక్షన్ కమిషనర్ రమేశ్‌కుమార్ పేరుతో మీడియాకు ఆ లేఖ అందింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కేంద్ర హోం శాఖకు ఎన్.రమేష్ కుమార్ లేఖ రాశారు. కేంద్ర హోం శాఖకు ఐదు పేజీల లేఖ రాశారు. ఎన్నికల్లో గెలవకుంటే పదవులు దక్కవని ముఖ్యమంత్రే.. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారని లేఖలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు హింసను పేర్రేపించారని అన్నారు. అలాగే తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరారు.

స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను పంపాలని కోరారు. ఎన్నడూలేని విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయని లేఖలో పేర్కొన్న ఎస్‌ఈసీ, 23 చోట్ల నామినేషన్లు బలవంతంగా విత్‌డ్రాలయ్యాయానికి చెప్పారు. 55 చోట్ల ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరిగాయని లేఖలో వివరించారు. కడప జిల్లాల్లో అత్యధికంగా ఎంపీటీసీలు 79 శాతం,.. జెడ్పీటీసీలు 76 శాతం ఏకగ్రీవమయ్యాయని లేఖలో పేర్కొన్నారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖతో ఆంధ్రప్రదేశ్‌లో గందరగోళం నెలకొంది. ఎలక్షన్ కమిషనర్ రమేశ్‌కుమార్ పేరుతో మీడియాకు ఆ లేఖ అందింది. ఆ లేఖను కేంద్ర హోంశాఖకు లేఖ తాను రాయలేదంటున్నారు ఎన్నికల కమిషనర్‌. ప్రభుత్వ తీరుపై లేఖలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికలు ఏక పక్షంగా సాగుతున్నాయంటూ ప్రస్తావించారు. సీఎం సొంత జిల్లాలో ఎక్కువ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని లేఖలో పేర్కొన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టడం వల్లే హింస చెలరేగిందని అందులో ప్రస్తావించారు. తనకు ప్రాణహాని ఉందని, కేంద్రం నుంచి రక్షణ కల్పించాలని రమేశ్‌ కుమార్ కోరుతున్నట్లు లేఖలో ఉంది. ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రబలగాలను పంపాలని ఆలేఖలో కోరారు. ఏపీ రాజకీయాల్లో ఈసీ లెటర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 

సరాసరి సిఎం జగన్ నే టార్గెట్ చేసిన ఈ లేఖతో ఒక్కసారిగా వైసీపీ అప్రమత్తమైయ్యింది. ఆరాతీయడం మొదలుపెట్టింది. ఈలోగా అసలు ఈ లేఖకు ఈసీ రమేష్ కుమార్ కు ఎలాంటి సంబంధంలేదని ఎన్నికల కార్యాలయం స్పష్టం చేసింది. ఈసీ రమేష్ కుమార్ స్వయంగా 10టీవీతో మాట్లాడారు. తాను ఈ లెటర్ ను ఎవరికి పంపలేదని తేల్చేశారు. తాను హోంశాఖకు ఎలాంటి లేఖ పంపలేదని అన్నారు. 

ఈసీ పంపినట్లుగా అనుకొంటున్న ఈ లేఖ ధోరణి అంతా టీడీపీకి అనుకూలంగా, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు మాటలను చెబుతున్నట్లుగానే సాగుతోంది. ఇంకోవాదనకూడా వినిపిస్తోంది. హోం శాఖకు ఈసీ లేఖరాసారు. అందులో ప్రభుత్వం గురించి ఘాటుగానే ప్రస్తావించారు. అలాగని ఈ వాదన సరైనదని చెప్పడానికి ఎలాంటి రుజువుల్లేవ్.