AP Exams: విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం జగన్ స్పష్టం

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాద్ధాంతం కొనసాగుతుండగానే సీఎం జగన్మోహన్ రెడ్డి పరీక్షలు నిర్వహించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు.

AP Exams: విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం జగన్ స్పష్టం

Cm Jagan Exams

AP Exams: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాద్ధాంతం కొనసాగుతుండగానే సీఎం జగన్మోహన్ రెడ్డి పరీక్షలు నిర్వహించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుంటే వారి భవిష్యత్తుకే నష్టమని అయన వెల్లడించారు. పరీక్షలు రద్దుచేయడం చాలా సులభమని, అన్ని జాగ్రత్తలతో నిర్వహించడమే కష్టమని చెప్పిన సీఎం విద్యార్థుల కోసం కష్టతరమైన మార్గాన్నే ఎంచుకున్నామన్నారు.

శుక్రవారం ఈ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగగా ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వం పున:పరిశీలన చేసుకోవాలని సూచించింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు.. పరీక్షల్లో భాగం కావాల్సి ఉందని, అందుకే పునరాలోచించుకోవాలని కోరింది. కేసు విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసిన కోర్టు అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఆదేశిస్తూ మే 2లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణ అనంతరం సీఎం జగన్ మరోసారి తన విధానాన్ని ప్రకటించారు.

నిన్ననే కేరళలో పరీక్షలు పూర్తిచేశారని.. పరీక్షలు పెట్టని రాష్ట్రాల విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే వస్తాయని.. అదే పరీక్షలు నిర్వహించి డెబ్భై శాతం మార్కులు తెచ్చుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్రం ఎలాంటి విధానం ప్రకటించలేదని.. రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసిందని చెప్పిన సీఎం మన విద్యార్థుల భవిష్యత్ కోసమే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు.