జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏపీ సర్కారు సై

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏపీ సర్కారు సై

ZPTC, MPTC elections : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏపీ సర్కార్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యవహారంలో హైకోర్టు తీర్పును బట్టి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎస్ఈసీ ఒకవేళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే అభ్యంతరం చెప్పకూడదని భావిస్తోంది.

ఈ నెలలోనే షెడ్యూల్ వస్తే.. ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్‌ ఆమోదింపచేసుకోవాలనే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఇందుకోసం ఓటాన్ అకౌంట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రీ నోటిఫికేషన్ పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 8వ తేదీకి వాయిదా వేసింది.