AP Government: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ పరీక్షల్లో పాసైతే చాలు ..

ఇటీవల ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విషయం విధితమే. ఉత్తీర్ణతశాతం తక్కువగా నమోదు కావటంతో సుమారు 2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తీపికబురందించింది.

AP Government: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ పరీక్షల్లో పాసైతే చాలు ..

10th Studient

AP Government: ఇటీవల ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విషయం విధితమే. ఉత్తీర్ణతశాతం తక్కువగా నమోదు కావటంతో సుమారు 2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తీపికబురందించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారిని కంపార్ట్ మెంట్ అని కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కులు ప్రకారం.. డివిజన్లను కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెమో జారీ చేశారు. అయితే ఈ విధానం ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తించనుంది.

AP 10th Results: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల.. 67 శాతం ఉత్తీర్ణత

ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన సంగతి విధితమే. జూన్ 6న ఫలితాలు విడుదలయ్యాయి. పలు కారణాల వల్ల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గింది. దాదాపు 2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కొవిడ్ కారణంగా తలెత్తిన ఇబ్బందులతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు చర్యలు చేపట్టింది.

TS TET Results 2022: నేడు టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

జూలై 6 నుంచి 15వ తేదీ వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చెల్లించాల్సిన రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఈసారి రెగ్యులర్‌ పరీక్షల్లో పాసై కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినవారికి బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇంటర్మీడియెట్‌లో తప్ప పదో తరగతిలో ఇలా బెటర్‌మెంట్‌ పరీక్షల విధానం లేదు. దీనికితోడు ఫెయిల్ అయిన విద్యార్థులు ఈసారి సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైతే వారిని రెగ్యూలర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులుగానే రాష్ట్ర ప్రభుత్వం పరిగణించనుంది.