Black Fungus Arogyasri : ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్, జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పాజిటివ్ కేసుల గుర్తింపు కోసం రాష్ట్రమంతా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని.. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Black Fungus Arogyasri : ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్, జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Black Fungus Arogyasri

Black Fungus Arogyasri : కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పాజిటివ్ కేసుల గుర్తింపు కోసం రాష్ట్రమంతా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని.. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని.. వాటికి సంబంధించిన కేసులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. బ్లాక్ ఫంగస్ వ్యాధికి సంబంధించిన మందులను సమకూర్చాలని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు.

బ్లాక్ ఫంగస్ కరోనా రోగుల పాలిట పెనుముప్పుగా మారింది. బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా రోగులు కంటిచూపు పోగొట్టుకోవడమే కాకుండా, కొన్నిసార్లు మృత్యువాత కూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారని వివరించారు.

గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేపడుతున్నామని, తద్వారా కరోనా బాధితులను గుర్తించడం సులువు అవుతుందని అన్నారు. సర్వేలో గుర్తించిన పాజిటివ్ వ్యక్తులను వారిలో లక్షణాల తీవ్రతను బట్టి ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడం వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన అన్నారు. మరోవైపు రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూని నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

”రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాలని సీఎం ఆదేశించారు. పాజిటివ్ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్ సర్వే చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మరింత పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తాము” అని మంత్రి ఆళ్లనాని అన్నారు.

అంతేకాదు కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. పదివేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఈ నెలాఖరు కల్లా 2వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ రాబోతున్నాయని అన్నారు.