అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, నిధులు విడుదల

ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు నిధులు విడుదల చేసింది. 2021-22 ఏడాదికి గాను రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ప్రభుత్వం నేడు(జూన్ 16,2021) విడుదల చేసింది.

అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, నిధులు విడుదల

Amaravati Farmers

Amaravati Farmers : ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు నిధులు విడుదల చేసింది. 2021-22 ఏడాదికి గాను రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ప్రభుత్వం నేడు(జూన్ 16,2021) విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ పథకం కింద గతంలో ప్రభుత్వానికి భూములు అప్పగించిన వారికి ఈ వార్షిక కౌలు వర్తిస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.

కాగా, ఈ ఏడాది కౌలు కోసం మందడం రైతులు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేసింది. గతంలో రైతులు కోర్టును ఆశ్రయించగా, విచారణ తర్వాతే సర్కారు నిధులు విడుదల చేసింది. ఈసారి విచారణకు ముందుగానే కౌలు ఇచ్చినట్టయింది.