Devineni Uma : మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమకు బెయిల్ మంజూరు

టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణాజిల్లా జీ కొండూరు పోలీసు స్టేషన్ లో దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

Devineni Uma : మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమకు బెయిల్ మంజూరు

Devineni Uma

Devineni Uma : టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణాజిల్లా జీ కొండూరు పోలీసు స్టేషన్ లో దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారని దేవినేని ఉమ హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్ధానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

గత నెల28న కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో దేవినేని ఉమ  పరిశీలన కోసం అక్కడకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగివస్తున్నప్పుడు జి.కొండూరు ప్రాంతంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. దీనికి దేనినేని ఉమామహేశ్వరరావు కారణమని పోలీసులు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో సహా 18 కేసులు నమోదు చేశారు.  జీ. కొండూరు పోలీసు స్టేషన్ లో హై డ్రామా నడిచిన తర్వాత ఆయన్ను ఆరెస్ట్ చేశారు.

అనంతరం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని పెదపారుపూడి, ఆ తరువాత నందివాడ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఆ తరువాత ఆయన్ను మైలవరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. హాజరు చేసిన వెంటనే, ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం దేవినేని ఉమా, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకుని వెళ్ళిన తరువాత, అక్కడ జైలు ఆఫీసర్ ని కూడా బదిలీ చేసారు. దీనిఫై  కూడా దుమారం రేగి, చివరకు ఉమా సతీమణి చీఫ్ జస్టిస్ కు, ఏపీ గవర్నర్ కు, కేంద్ర హోంమంత్రికి కూడా లేఖలు రాసే దాకా పరిస్ధితి వెళ్ళింది. ఈ నేపధ్యంలోనే హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. మంగళవారం బెయిల్ పిటీషన్ పై ఇరు పక్షాల వాదన విన్న ఏపీ హై కోర్టు   ఈ రోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో ఎవరికీ కూడా హాని జరగలేదని, అసలు దీంట్లో 307 వర్తించదు అని ఉమ తరుఫు న్యాయవాది వాదించారు. అదే విధంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బంధువు కారు డ్రైవర్ కులం ఏమిటో, దేవినేని ఉమాకు ఎలా తెలుస్తుంది అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కక్షతోనే ఈ కేసు మోపారని చెప్పారు. దీనికి సంబంధించి కొన్ని సాంకేతిక ఆధారాలు కూడా హైకోర్టు ముందు ప్రస్తావించారు.

తన పై దాడి చేసారని ఇచ్చిన కంప్లైంట్ సమయం చూస్తే, ఆ సమయంలో దేవినేని ఉమా మీడియాతో లైవ్ లో ఉన్నారని, ఇది తప్పుడు కేసు అని చెప్పటానికి, ఇదే కారణం అని అన్నారు. అయితే దేవినేని ఉమాకి బెయిల్ ఇవ్వటానికి వీలు లేదని, ఉమాని పోలీస్ కస్టడీకి అడిగారని, ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారని కోర్టుకు చెప్పారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు బెయిల్ ఇచ్చింది. పూర్తి ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత, షరతులు ఏమిటి అనేవి, అలాగే కోర్టు అబ్జర్వేషన్స్ తెలిసే అవకాశం ఉంది. దేవినేని ఉమా ఈ రోజు సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.