న్యాయమూర్తులపై వ్యాఖ్యలు : మరో 44 మందికి నోటీసులు
ఆంధ్ర ప్రదేశ్ లో హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అంశంలో మరో 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై శుక్రవారం హైకోర్టు లో విచారణ జరిగింది.
సోషల్ మీడియాలో హైకోర్టు పై వ్యాఖ్యలు చేసిన సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాస రావు, పంచ్ ప్రభాకర్ తోసహ 44 మందికి నోటీసులు జారీ అయ్యాయి. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిష్ట్రార్ పిటీషన్ దాఖలు చేయటంతో ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దాగారు. కోర్టులను,న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో ఇంతకు ముందు 49 మందికి నోటీసులు ఇచ్చిన అధికారులు వీరిలో పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.