విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని తప్పుబట్టిన ఏపీ హైకోర్టు

  • Published By: bheemraj ,Published On : August 18, 2020 / 03:43 PM IST
విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని తప్పుబట్టిన ఏపీ హైకోర్టు

ఇళ్ల పట్టాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.



దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఇళ్ల పట్టాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.



ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 8 వారాల తర్వాతకు వాయిదా వేసింది.