AP High Court : న్యాయమూర్తుల బదిలీలపై ఏపీ లాయర్ల నిరసన..విధులు బహిష్కరించి ఆందోళన

వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం  సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున న్యాయమూర్తులున్నారు. ఈక్రమంలో ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జిలను బదిలీ చేయడంపై ఏపీ హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ లను బదిలీ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ, విధులను బహిష్కరించారు.

AP High Court : న్యాయమూర్తుల బదిలీలపై ఏపీ లాయర్ల నిరసన..విధులు బహిష్కరించి ఆందోళన

AP High Court lawyers protest amid transfer of two judges

AP High Court : వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం  సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున న్యాయమూర్తులున్నారు. ఈక్రమంలో ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జిలను బదిలీ చేయడంపై ఏపీ హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ లను బదిలీ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ, విధులను బహిష్కరించారు.

ఏపీ హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని న్యాయవాదులు విమర్శించారు. విధులు బహిష్కరించాలని ఏపీ బార్ కౌన్సిల్ నిర్ణయించటంతో లాయర్లు అంతా ఏపీ హైకోర్టు వద్ద నిరసర కార్యక్రమాలు చేస్తున్నారు.

దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు జడ్జిలను ఇతర హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిన్న సిఫారసు చేసింది. వీరిలో ఏపీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరేసి, తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు ఉన్నారు. జస్టిస్ దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేశ్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది.