AP High Court Stay : దళిత స్మశాన వాటికల్లో జగనన్న ఇళ్ళ నిర్మాణాలపై హైకోర్టు స్టే
ఏపీలో స్మశాన వాటికల్లోజగనన్న ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. దళిత స్మశాన వాటికల్లో జగనన్న ఇళ్ళ కేటాయింపుపై హైకోర్టు స్టే విధించింది. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత స్మశాన వాటికల్లో ఇళ్లు నిర్మిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం స్మశాన వాటికల్లో ఇళ్ళను కేటాయించింది.
AP High Court Stay : ఏపీలో స్మశాన వాటికల్లోజగనన్న ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. దళిత స్మశాన వాటికల్లో జగనన్న ఇళ్ళ కేటాయింపుపై హైకోర్టు స్టే విధించింది. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత స్మశాన వాటికల్లో ఇళ్లు నిర్మిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం స్మశాన వాటికల్లో ఇళ్ళను కేటాయించింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈస్ట్ గోదావరి కపిలేశ్వరంకు చెందిన పెయ్యాల యాకోబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బోర్డ్ స్టాండింగ్కు వ్యతిరేకంగా స్మశాన వాటికల్లో ఇళ్ళు కేటాయించడం దారుణమని పిటిషనర్ తరుపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదించాడు.
శ్రావణ్ కుమార్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దళిత స్మశాన వాటికల్లో రైతు భరోసా కేంద్రాలు, జగనన్న ఇళ్ళు కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.