Dharmana Prasada Rao: ప్రభుత్వ పథకాలపై టీడీపీ అసత్య ప్రచారం: ధర్మాన ప్రసాదరావు

జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao).

Dharmana Prasada Rao: ప్రభుత్వ పథకాలపై టీడీపీ అసత్య ప్రచారం: ధర్మాన ప్రసాదరావు

Ap Minister

Dharmana Prasada Rao: జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ప్రభుత్వ పథకాలపై అసత్య ప్రచారం చేసే దొంగలు ఊళ్లల్లో తిరుగుతున్నారు. అసత్య ప్రచారాల విషయంలో ప్రజలదే అంతిమ నిర్ణయం.

AP CM Jagan : విజయవాడలో అత్యాచారం ఘటన.. బాధితురాలికి ప్రభుత్వం పరిహారం

ప్రజాకర్షక పథకాలు ఇస్తున్న వైసీపీని ఓడిస్తే, కొత్తగా వచ్చే పార్టీ వాటిని అమలు చేయలేదు. గతంలో జన్మభూమి కమిటీలు అనే బ్రోకర్లు ప్రతి గ్రామంలో ఉండేవాళ్లు. ఆ బ్రోకర్లకు లంచం ఇస్తే తప్ప ఏ పథకమూ అందేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దర్జాగా ప్రజల అకౌంట్లలోనే డబ్బులు పడిపోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో చెప్పింది చేసి తీరుతాం అనేదే జగన్ ప్రభుత్వ మోటో అని ధర్మాన అన్నారు.