Kodali Nani: టీడీపీ చీర్ బాయ్స్ బైడెన్కు ఫిర్యాదు చేస్తారేమో?
గుడివాడ క్యాసినో అంశంపై టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేస్తుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
Kodali Nani: గుడివాడ క్యాసినో అంశంపై టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేస్తుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. గుడివాడలో తనను ఓడించలేక క్యాసినో నిర్వహించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు ఐదొందల కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలని ప్రశ్నించారు.
గుడివాడ ప్రజలు అమాయకులు కాదని, వారికి అన్ని విషయాలు తెలుసునని అన్నారు కొడాలి నాని. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకమని అన్నారు.
గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో? అంటూ ఎద్దేవా చేశారు. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైమ్ ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవచ్చు అని అన్నారు మంత్రి కొడాలి నాని.