విశాఖ, తిరుపతి మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
Mayor of Visakhapatnam, Tirupati : మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన వైసీపీ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో బిజీ అయింది. విశాఖ మేయర్గా వంశీకృష్ణ శ్రీనివాస్ పేరును పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. వంశీకృష్ణ 21వ వార్డు నుంచి 2 వేల 275 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్టీ అవిర్భావం నుంచి వైసీపీలోనే ఉన్న వంశీకృష్ణ 2014 ఎన్నికల్లో తూర్పు నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధిష్టానం సీటు నిరాకరించింది. అప్పుడే మేయర్ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇక చిత్తూరు విషయానికి వస్తే..చిత్తూరు మేయర్ రేస్లో పూమణి ఉన్నారు. 24 డివిజన్ కార్పొరేటర్గా పూమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు తిరుపతి మేయర్ రేస్లో డా.శిరీష ఉన్నారు . ఆమె 27వ డివిజన్ కార్పొరేటర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక తిరుపతి డిప్యూటీ మేయర్గా భూమన కుమారుడు అభినయ్ రెడ్డి దాదాపు ఖరారయ్యారు.