AP Corona Cases : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 14వేలకు పైగా కేసులు
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు..
AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు భారీగా వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14వేల 440 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు కోవిడ్ తో చనిపోయారు. తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. మరోవైపు 369 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
Mahesh Babu: గౌతమ్ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..
ప్రస్తుతం రాష్ట్రంలో 83వేల 610 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన వాటిలో విశాఖలో అత్యధికంగా 2వేల 258 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1,534 కేసులు వెలుగుచూశాయి. కాగా, రాష్ట్రంలో నిన్న 12వేల 926 కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.
Coconut : పవిత్రంగా భావించే కొబ్బరితో ప్రయోజనాలు ఎన్నంటే?
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,80,634 కి చేరింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,82,482గా ఉంది. గడిచిన 24 గంటల్లో 46వేల 650 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,21,47,031 కోవిడ్ టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
#COVIDUpdates: 23/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,77,739 పాజిటివ్ కేసు లకు గాను
*20,79,587 మంది డిశ్చార్జ్ కాగా
*14,542 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 83,610#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XUM7SfIdOL— ArogyaAndhra (@ArogyaAndhra) January 23, 2022