రీసోర్స్, కమ్యునిటీ రీసోర్స్ పర్సన్స్లపై ఎస్ఈసీ ఆంక్షలు
పట్టణాల్లోని రీసోర్స్, కమ్యునిటీ పర్సన్స్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. వాళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
AP SEC restrictions : పట్టణాల్లోని రీసోర్స్, కమ్యునిటీ పర్సన్స్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. కొన్ని పట్టణ ప్రాంతాలలో రీసోర్స్, కమ్యునిటీ పర్సన్స్ ఎన్నికల ప్రచారం చేయడంపై ఎస్ఈసీకి ఫిర్యాదులందాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు.
దీంతో కమ్యునిటీ రిసోర్స్ పర్సన్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదన్నారు. ఓటరు స్లిప్పులు పంపిణీ చేయకూడదని తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.