SC, STల సంక్షేమ ఖర్చులో ఏపీ రికార్డు…1.02 కోట్ల మందికి లబ్ధి – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : July 17, 2020 / 02:02 PM IST
SC, STల సంక్షేమ ఖర్చులో ఏపీ రికార్డు…1.02 కోట్ల మందికి లబ్ధి – సీఎం జగన్

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST,  వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN  వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు, మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని అధికారులు వెల్లడించారు.

2020, జులై 17వ తేదీ శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం జరిగింది. మంత్రులు పి.విశ్వరూప్, తానేటి వనిత, ధర్మాన కృష్ణదాసు, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని సహా వివిధ శాఖల సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ…అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే లక్ష్యమని, ఎంత మందికి వీలైతే అంత మందికి మేలు జరగాలన్నారు. ఆసరా, చేయూత పథకాల ద్వారా మరింత లబ్ధి జరుగుతుందన్న ఆకాంక్షించారు.

సమావేశంలో CM JAGAN ఏమన్నారంటే :-
– ఎస్సీ, ఎస్టీల కోసం అమలు చేసిన పథకాలు.. ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చాం.
– ఇప్పుడు జరుగుతున్న లబ్ధి అంతా ఆ పథకాల నుంచే
– సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మంచి జరిగితే అంత మంచిది
– ఆసరా, చేయూత పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలు అవుతున్నాయి దీంతో ఎస్సీ, ఎస్టీలకు పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుంది

– YSR ASARA కింద కనీసం 25లక్షల మహిళలకు లబ్ధి
– YSR CHEYUTHA  కింద దాదాపు 90 లక్షల మహిళలకు లబ్ధి
– ఈ పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్తోమత పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి
– మహిళల స్వయం సాధికారితకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయి

– రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం
– ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని సీఎం జగన్ తెలిపారు.

ఎస్టీ, ఎస్సీల కోసం ఖర్చు ఇలా : –
2018–19లో ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు ఖర్చు.
ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు.
2019–20లో ఎస్సీల కోసం రూ.11,205.41 కోట్లు ఖర్చు.
ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు.

ఈ ఏడాది (2020–21)కి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.
77,27,033 మంది ఎస్సీలకు,  24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి. మొత్తంగా 1,01,82,319 మంది ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి.