Road Accident: ఫ్రెండ్ పుట్టినరోజుకు వెళుతు..ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి

స్నేహితుడు పుట్టిన రోజని సంతోషంగా గడుపుదామని బయలుదేరిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

Road Accident: ఫ్రెండ్ పుట్టినరోజుకు వెళుతు..ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి

Road Accident

Two software engineers dead in road accident :  స్నేహితుడు పుట్టిన రోజని సంతోషంగా గడుపుదామని బయలుదేరిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖపట్నం నగరంలోని పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలో వీ కన్వెన్షన్‌ హాల్‌ ఎదురుగా మంగళవారం (నవంబర్ 9,2021) తెల్లవారితే బుధవారం అనగా..ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 22 ఏళ్ల ధనరాజ్‌, 22 కె.వినోద్‌ ఖన్నా అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు.

Read more : Family End lives: చూడమని ఇచ్చిన బిడ్డను మాయం చేసింది…కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు

ఈ ప్రమాదంపై PM పాలెం సీఐ రవికుమార్ మాట్లాడుతు..మంగళవారం రాత్రి మారికవలస ప్రాంతానికి చెందిన ధనరాజ్‌, కె.వినోద్‌ ఖన్నా కలిసి పనోరమ హిల్స్‌లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్‌ పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యారు. ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్‌ పోయించుకోవటానికి కొమ్మాది పెట్రోల్‌ బంక్‌కు వెళ్లి పెట్రోల్ పోయించుకుని మళ్లీ అక్కడి నుంచి తిరిగి పనోరమ హిల్స్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపానికి రాగానే గుర్తు తెలియని ఓ వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో ధనరాజ్‌, వినోద్‌ ఖన్నా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ధనరాజ్‌ ఇన్ఫోసిస్‌లో, వినోద్‌ ఖన్నా స్థానికంగానే రామాటాకీస్‌ వద్ద ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి మరణంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.

Read more : RRR Movie : ఓరి మీ దుంపలు తెగ.. వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్..