Andra pradesh : ప్రధాని పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు రావాలని చంద్రబాబుకు మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. జులై 4వ తేదీన ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా జరిగే అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కావాలని…తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆహ్వాన లేఖతో పాటు కిషన్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ చెప్పారు.

Andra pradesh : ప్రధాని పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు రావాలని చంద్రబాబుకు మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

Kishan Reddys Letter To Chandrababu

kishan reddys letter to chandrababu : మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. జులై 4వ తేదీన ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా జరిగే అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కావాలని…తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆహ్వాన లేఖతో పాటు కిషన్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ చెప్పారు.

అల్లూరి జయంతి వేడుకల్లో టీడీపీ తరపున మీరు రావాలి అంటూ కోరారు.దీంతో భీమవరంలో జరిగే కార్యక్రమానికి చంద్రబాబు స్వయంగా వెళతారా? లేదా ఉత్తరాంధ్రా టీడీపీ నేత అచ్చెన్నాయుడు హాజరుకానున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి. కాగా జులై 4వ తేదీన ప్రధానమంత్రి మోడీ భీమవరం వస్తున్నారు అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల జీవితాలను ప్రజలకు వివరిస్తామని.. అల్లూరి సీతారామరాజు తరహాలో ఎంతో మంది త్యాగాలను మోడీ వివరిస్తున్నారు…

చంద్రబాబు స్వయంగా వెళితే..చాలా కాలం తరువాత ప్రధాని మోడీతో కలిసి ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ దోస్తీ ఏంటో తెలిసిందే.తరువాత ఏపీకి ప్రత్యేక హోదా..ప్రత్యేక ప్యాకేజ్ వంటి పలు కీలక అంశాలపై బీజేపీ టీడీపీ మధ్య విభేధాలు వచ్చి విడిపోయాయి. అప్పటి నుంచి బీజేపీ టీడీపీ నేతలపై విమర్శలు చేస్తునే ఉంది. ఈక్రమంలో మంత్రి కిషన్ రెడ్డి నుంచి ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి చంద్రబాబుని రమ్మని ఆహ్వానం పంపటం..చంద్రబాబు స్వయంగా వెళతారా? లేదా పార్టీ ప్రతినిధిగా మరెవరినైనా పంపిస్తారా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.