Husband Murder Wife Sucide : భర్త హత్య..గర్భంతో ఉన్న భార్య ఆత్మహత్య..

Husband Murder Wife Sucide : భర్త హత్య..గర్భంతో ఉన్న భార్య ఆత్మహత్య..

Wife Commits Sucide After Husbend Murder (1)

Wife Commits Sucide after Husband Murder : ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లైంది. ఆమెగర్భవతి అయ్యింది. ఇంతలోనే కలహాలు. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. మళ్లీ కలుస్తారనే ఆశతోనే జీవిస్తున్న క్రమంలో భర్త హత్యకు గురయ్యాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. భార్యను విచారించటానికి పోలీసులు ఆమె ఉండే ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. అంతే ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోయింది. భర్త హత్య గురించి తెలిసిన భార్య ఎందుకు ఉరి వేసుకుంది? మనోవేదనతోనే ఉరి వేసుకుందా? ఆమెతో పాటు కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు కూడా తీయాల్సి వచ్చిన పెను విషాదకర ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. అసలు భర్తను ఎవరు హత్య చేశారు? ఆ అవసరం ఎవరికుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంగోలులో బుధవారం (ఏప్రిల్ 14,2021) జరిగిన ఈ విషాద ఘటన సంచలనంగా మారింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

ఒంగోలు సీతారామపురానికి చెందిన ఆటోడ్రైవర్‌గా పనిచేసే కభాలి నాగరాజు అనే 27 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. బుధవారం టంగుటూరు మండలం మర్లపాడు సమీపంలో ఇనగలేరు వాగులో నాగరాజు మృతదేహం పడి ఉంది. దీనిపై స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. అతని భార్య శ్రీవల్లి అని తెలుసుకున్న పోలీసులు ఒంగోలు సంజీవ్‌గాంధీ నగర్‌లో అద్దె ఇంటిలో ఉంటున్న శ్రీవల్లి దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారు. దీంతో శ్రీవల్లి ఇప్పుడే వస్తానంటూ ఇంటిలోకి వెళ్లి ఉరి వేసుకుంది.

మరింత వివరాల్లోకి వెళితే..మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడుకు చెందిన శ్రీవల్లి ఒంగోలు పెద్దమసీదు వద్ద వస్త్రదుకాణంలో పనిచేసేది. ఈక్రమంలో పరిచయం అయిన ఆటోడ్రైవర్‌గా పనిచేసే నాగరాజును ప్రేమించింది. సహజంగానే అమ్మాయి తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు. అయినా వారు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. అలా మూడేళ్లు గడిచాయి. విభేదాలు పెరగటంతో నాగరాజు భార్యను వదిలి తల్లిదండ్రుల వద్దకే వెళ్లి ఉంటున్నారు. శ్రీవల్లి మాత్రం తాము అద్దెకు ఉండే ఇంటిలోనే ఉంటోంది. నాలుగునెలల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలోనే నాగరాజు హత్యకు గురై ఇనగలేరు వాగులో శవంగా తేలాడు.

మంగళవారం ఉదయం జాళ్ళపాలెం తిరునాళ్ళకు వెళ్లిన నాగరాజు ఆరోజు రాత్రి 8గంటలకు లారీడ్రైవర్‌గా పనిచేసే తన సోదరుడు రంగయ్యకు ఫోన్‌ చేసి తాను జాళ్ళపాలెం తిరునాళ్లకు వెళుతున్నానని..నువ్వు కూడా వస్తావా? అని అడిగాడు.దానికి రంగయ్య తాను డ్యూటీమీద ఊటీలో ఉన్నానని తిరునాళ్లకు రాలేనని చెప్పాడు. మరి ఆ తరువాత ఏమైందో ఏమోగారీ తెల్లవారేసరికి నాగరాజు మర్లపాడు సమీపంలో ఇనగలేరు వాగులో నాగరాజు మృతదేహం తేలుతూ కనిపించింది. అది చూసిన స్థానికులు గ్రామ వీఆర్వో శ్రీదేవి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

నాగరాజు మృతదేహంపై తీవ్రగాయాలు
ఆటోడ్రైవర్‌ నాగరాజు మృతదేహంపై గాయాలున్నాయి. పదునైన ఆయుధంతో పొడిచి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నాగరాజు తల వెనుక భాగంలో బలమైన గాయం ఉంది. అంతేకాకుండా గొంతులో, ఛాతిపైనా, ముఖంపైన గాయాలు ఉన్నాయి. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

విచారణ కోసం పోలీసులు రావడంతో భార్య శ్రీవల్లి ఆత్మహత్య

నాగరాజు మృతిచెందాడని తెలిసి స్థానిక సీతారామపురంలోని అత్తగారి ఇంటికి శ్రీవల్లి తన తల్లి, సోదరితో కలిసి వెళ్లింది. అయితే అక్కడ ఎవరు లేరు. అదేసమయంలో పోలీసులు వారిని వెతుకుంటూ అక్కడకు వెళ్లారు. శ్రీవల్లిని విచారించాలి రమ్మని పిలిచారు. వారివెంట కొంతదూరం వచ్చిన శ్రీవల్లి పర్సు తీసుకువస్తాను అని చెప్పి తిరిగి తను సంజీవ్‌ గాంధీ నగర్‌ లో తాను అద్దెకు ఉండే ఇంటికి వెళ్లింది. వెళ్లిన శ్రీవల్లి ఎంతకూ తిరిగి రాకపోయేసరికి ఆమె తల్లి, సోదరి ఆందోళనతో వెళ్లి చూడగా ఇంట్లో చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను కిందకు దించి చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

నాగరాజుకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని పోలీసుల అనుమానం..ఆ దిశగా విచారణ
ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్న వారు ఎందుకు విడిపోయారు? దీనికి వివాహేతర సంబంధాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా భర్త మృతిచెందాడన్నా తర్వాత భార్య ఆత్మహత్యకు పాల్పడటంపైన కూడా విచారిస్తున్నారు. నాగరాజు ఇంటి నుంచి బయిటకు వెళ్లిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఎవరెవరిని కలిసాడు? తిరునాళ్లలో ఎవరితో తిరిగాడు? అతనికి ఎవరైనా శతృవులున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డీఎస్పీ పరిశీలన..హత్య కేసుగా నమోదు..దర్యాప్తు
నాగరాజు మృతదేహం పడవేసిన ప్రాంతాన్ని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ పరిశీలించారు. ఘటనను హత్యకేసుగా నమోదు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే మృతుడి భార్య శ్రీవల్లి ఆత్మహత్య ను కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.