తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి.. తీవ్రగాయాలు!

తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి.. తీవ్రగాయాలు!

spokesperson Pattabhi:తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిపై కృష్ణా జిల్లా విజయవాడలో దాడి జరిగింది. పట్టాభి ఇంటి దగ్గరే దుండగులు దాడికి దిగారు. రాడ్‌తో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పట్టాభికి తీవ్ర గాయాలవగా.. సెల్‌ఫోన్ కూడా ధ్వంసం చేశారు దుండగులు. కారు అద్దాలు పగులగొట్టి, ఇంటి నుంచి టీడీపీ కార్యాలయానికి బయల్దేరుతుండగా మధ్యలో దుండగులు దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.

పట్టాభిపై జరిగిన దాడిలో సుమారు 10 మంది దుండగులు పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో పట్టాభికి తీవ్ర గాయాలవగా.. ఆయనను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిని టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. వైసీపీనే చేయించినట్లుగా ఆరోపిస్తున్నారు.

పట్టాభిపై దాడి జరగటం ఇది రెండోసారి. రెండు నెలల క్రితం కూడా ఆయన వాహనంపై దుండగులు దాడి చేశారు. తనపై జగన్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దాడికి యత్నిస్తోందని ఇప్పటికే పలుమార్లు పట్టాభి ఆరోపించారు.