తూర్పుగోదావరి జిల్లాలో దారుణం : వైసీపీకి మద్దతిచ్చారని 15 కుటుంబాలపై దాడులు, కుల బహిష్కరణ

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం : వైసీపీకి మద్దతిచ్చారని 15 కుటుంబాలపై దాడులు, కుల బహిష్కరణ

caste boycotts on 15 families : తూర్పుగోదావరి జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేపింది. పంచాయతీ ఎన్నికల్లో తమను కాదని.. కొన్ని కుటుంబాలు వేరే అభ్యర్థికి మద్దతివ్వడంతో ఏకంగా ఆ 15 కుటుంబాలను గ్రామపెద్దలు బహిష్కరించారు. కాజులూరు మండలం జగన్నాధగిరి గుత్తులవారిపేటలో వైసీపీ మద్దతుదారుకి సపోర్టు చేసిన కుటుంబాలు కుల బహిష్కరణకు గురయ్యాయి.

వైసీపీ మద్దతుదారు గెలవడంతో గ్రామ పెద్దల కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు. 15 కుటుంబాలపై దాడులకు గ్రామపెద్దలు దిగుతున్నారు. వైసీపీ అభ్యర్థి విజయం సాధించడంతో.. భారీగా ధన నష్టం వచ్చిందంటూ.. తమపై గ్రామ పెద్దలు కక్ష సాధింపు చర్యలకు దిగారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కనీసం గుడిలో ప్రవేశం లేదని.. ఆంక్షలు విధించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను గుడిమెట్లు కూడా ఎక్కనివ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. తమపైనే రివర్స్‌లో కేసులు పెడతామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు.