woman died with Corona : కరోనాతో చనిపోయిన మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లని అధికారులు..నిన్నటి నుంచి ఇంట్లోనే శవం

ప్రకాశం జిల్లా కనిగిరి సాయినగర్‌లో అమానుషం చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన ఓ మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

woman died with Corona : కరోనాతో చనిపోయిన మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లని అధికారులు..నిన్నటి నుంచి ఇంట్లోనే శవం

died

woman died with Corona : ప్రకాశం జిల్లా కనిగిరి సాయినగర్‌లో అమానుషం చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన ఓ మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోపిశెట్టి నరసమ్మ నిన్న రాత్రి 7గంటల సమయంలో చనిపోయింది.

నాగిరెడ్డి పల్లిలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆమె కుమారుడు గోపిశెట్టి రవి.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే వాళ్లు ఇంతవరకు పట్టించుకోకపోవడంతో… మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది.

విషయం తెలిసిన కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.