Jairam Ramesh: 18న ఏపీలోకి ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర.. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ..

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు పాదయాత్ర ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లు చర్చించారు.

Jairam Ramesh: 18న ఏపీలోకి ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర.. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ..

Bharath Jodo yatra

Jairam Ramesh: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు పాదయాత్ర ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లు చర్చించారు. మంగళవారం కర్నూల్ జిల్లాలో కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఈ నెల 18న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తయిందని, ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతుందని పూర్తిచేసుకొని యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తోందని అన్నారు.

Tirumala Devotees Increased : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఆలూరి నియోజకవర్గం నుంచి మంత్రాలయం వరకు నాలుగు రోజుల పాటు 95 కి.మీ మేర ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో 13 రోజుల పాటు యాత్ర జరుగుతుందని జైరాం రమేష్ వివరించారు. అనంతరం మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని తెలిపారు. దేశంలో కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

విభజించు, పాలించు అనే నినాదంతో బీజేపీ పాలన సాగుతోందన్నారు. 2024లో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆ బాధ్యత కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి ఉమెన్ చాందీ, తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.