SBI బ్యాంక్లో భారీ చోరీ, 90లక్షలు దోపిడీ
robbery in bank: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి SBI బ్యాంక్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలను బ్లాక్ చేసి.. గ్యాస్ కట్టర్లతో గేట్లు కట్ చేశారు దొంగలు. ఆ తర్వాత బ్యాంక్ లోపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. బ్యాంక్ నుంచి ఏకంగా 90 లక్షల రూపాయలను దోచుకుపోయారు. దొంగతనం జరిగిందని తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులతో క్లూస్ టీమ్ బ్యాంక్కు చేరుకుంది. ఈ చోరీ స్థానికంగా కలకలం రేపింది. భారీగా డబ్బు దోపిడీ కావడం సంచలనమైంది. పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.