బ్రేకింగ్ న్యూస్ : విజయవాడ కరోనా సెంటర్ లో మంటలు

  • Published By: madhu ,Published On : August 9, 2020 / 06:37 AM IST
బ్రేకింగ్ న్యూస్ : విజయవాడ కరోనా సెంటర్ లో మంటలు

విజయవాడలో ఉన్న స్వర్ణ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇటీవలే ఈ కాంప్లెక్స్ ను కరోనా సెంటర్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కరోనా రోగులు ఉండడం ఆందోళన కలిగించింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ 50 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్నామని, రక్షించాలని రోగులు కేకలు వేశారు.

అగ్నిమాపక సిబ్బంది కొంతమందిని రక్షించి..అప్పటికే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో వారిని ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఆ మార్గం గుండా వెళుతున్న వారు, స్థానికంగా ఉన్న వారు తీవ్ర భయందోళనలకు గురయ్యారు.

మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా..అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రాణ నష్టం సంభవించలేదని, షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది.