పెళ్లైన నాలుగు రోజులకే వధువును ఇంట్లో వదిలి పారిపోయిన వరుడు

  • Published By: srihari ,Published On : May 28, 2020 / 04:23 PM IST
పెళ్లైన నాలుగు రోజులకే వధువును ఇంట్లో వదిలి పారిపోయిన వరుడు

కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్లలో వరుడు జంప్ అయ్యాడు. పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువును తన ఇంట్లోనే వదిలి పారిపోయాడు. దీంతో నవ వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ వ్యవహారమే కారణమని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. వీరకుమార్ గౌడ్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. 

కోవెలకుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కు సమీపంలో ఉండే వీరకుమార్ గౌడ్ 
నాలుగు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అనంతరం భార్యను ఇంట్లో వదిలి పరారైనట్లు సమాచారం నవ వధువును తన 
ఇంట్లోనే వదిలి పెట్టి పరారైనట్లు తెలుస్తోంది. 

దీనికి సంబంధించి వధువు, వరుడు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరకుమార్ గౌడ్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పని చేస్తున్నట్లు సమాచారం. ప్రేమ వ్యవహారం ఉండే ఇలా చేసి ఉంటాడని వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కట్నం, బంగారం ఇచ్చినప్పటికీ ఇలా మోసం చేయడం కరెక్టు కాదని వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం పెళ్లి అయితే రెండు రోజులు ఉన్నాడు..మూడో రోజు ఎవరికి చెప్పకుండా ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడికి వెళ్లాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

పారిపోయిన వరుడు వీరకుమార్ గౌడ్ గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వధువు మాత్రం పెళ్లి ఇంట్లోనే ఉంది. వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.