Visakhapatnam : విశాఖలో కూలిన బ్రిడ్జి పిల్లర్.. ఇద్దరు మృతి

విశాఖపట్నంలోని పుప్పాక జంక్షన్ వద్ద ఓ ఫ్లై ఓవర్ పిల్లర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు, ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. ట్యాంకర్ లో ఉన్న క్లినర్ కి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Visakhapatnam : విశాఖలో కూలిన బ్రిడ్జి పిల్లర్.. ఇద్దరు మృతి

Visakhapatnam (2)

Visakhapatnam : విశాఖపట్నంలోని పుప్పాక జంక్షన్ వద్ద ఓ ఫ్లై ఓవర్ పిల్లర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు, ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. ట్యాంకర్ లో ఉన్న క్లినర్ కి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

కాగా అనకాపల్లి-సబ్బవరం మధ్య ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అకస్మాత్తుగా ఫ్లై ఓవర్ పిల్లర్ కూలింది. అయితే ఈ ప్రాంతంలో మూడు బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతున్నాయి. ప్రస్తుతం కూలిన బ్రిడ్జి కింద భాగాన్ని పార్కింగ్ ప్లేస్ గా వాడుతున్నారు. వాహన రాకపోకలు లేకపోవడం పెనుప్రమాదం తప్పింది.