Bunny Utsav : కర్రల సమరం దేవరగట్టు..బన్నీ ఉత్సవం, ఎందుకు కొట్టుకుంటారు ?

కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. కర్రలతో కొట్టుకునేందుకు 11గ్రామాల ప్రజలు సన్నద్ధమయ్యారు. తెల్లవారు జామున 4గంటల వరకు పోరు కొనసాగుతుంది.

Bunny Utsav : కర్రల సమరం దేవరగట్టు..బన్నీ ఉత్సవం, ఎందుకు కొట్టుకుంటారు ?

Dasara Bunny

Bunny Utsav At Devaragattu 2021 : కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. కర్రలతో కొట్టుకునేందుకు 11గ్రామాల ప్రజలు సన్నద్ధమయ్యారు. 2021, అక్టోబర్ 15వ తేదీ శుక్రవారం రాత్రి 12గంటలకు మాలమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. ఆ తరువాత కర్రల యుద్ధం ప్రారంభమవుతుంది. తెల్లవారు జామున 4గంటల వరకు పోరు కొనసాగుతుంది. విజయదశమి పర్వదినాన.. కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో మాల మల్లేశ్వరస్వామి కొలువైన దేవరగట్టులో బన్ని ఉత్సవాలు ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. దేవరగట్టులో దశమి రోజున మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. కళ్యాణోత్సవం అనంతరం స్వామి వారిని ఊరేగిస్తారు. ఉత్సవ మూర్తులను మేళతాళాలతో కొండ దిగువన సింహాసన కట్టకు చేరుస్తారు. అక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. ఆచారంలో భాగంగా.. ఉత్సవమూర్తులను తమ వశం చేసుకునేందుకు కర్రల యుద్ధానికి సిద్ధమవుతారు.

Read More : Dasra 2021 : ఇంద్రకీలాద్రిపై భక్తుల కిటకిట…చివరి భక్తునికి కూడా అమ్మవారి దర్శనం

మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి 11 గ్రామాల ప్రజలు పోటీ పడుతూ రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది.. అయితే ఈసారి కర్నూలు దేవరగట్టు కర్రల సమరంపై కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు.. అగ్గి దివిటీలు, ఐరన్‌ రింగులు తొడిగిన కర్రలు తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేశారు. బన్నీ ఉత్సవాలకు బంధువులను పిలవొద్దని.. కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.. వాహనాలను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు పోలీసులు..  దేవరగట్టు చుట్టూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.. ఇప్పటికే 360 ఐరన్‌ రింగులు తొడిగిన కర్రలు స్వాధీనం చేసుకున్నారు.

Read More : Dussehra 2021: అంతిమ విజయం ధర్మానిదే.. విజయదశమి శుభాకాంక్షలు

ఇక ఉత్సవాల్లో అల్లర్లకు పాల్పడతారని అనుమానిస్తున్న 160 మందిని మూడు రోజుల క్రితమే అదుపులోకి తీసుకొని.. కోర్టు ముందు హాజరుపరిచారు.. ఇక ముందు జాగ్రత్తగా దేవరగట్టులో 20 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.దేవరగట్టులో జరిగేది కర్రల సమరం కాదు సంప్రదాయం మాత్రమేనన్నారు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. ప్రాచీన కాలంలో కరెంటు లేకపోవడంతో క్రూరమృగాలు, జంతువుల నుంచి తమ రక్షణ కోసం అగ్గి దివిటీలు, ఐరన్ రింగ్లు తొడిగిన కర్రలు తీసుకొని వెళ్లే వారని తెలిపారు. ప్రస్తుతం కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందన్నారాయన. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికార యంత్రాంగం, పోలీసులు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులంతా సమన్వయంతో ప్రత్యేకంగా చర్యలు చేపట్టారని వెల్లడించారు మంత్రి గుమ్మనూరు జయరాం.