Chandrababu : అసెంబ్లీకి వెళ్దామా ? వద్దా ? టీడీపీ ఎమ్మెల్యేల అంతర్మథనం..టీడీపీ ఆఫీసుకు భారీగా నేతల రాక

టీడీపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ తదనంతరం జరిగిన పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నారు.

Chandrababu : అసెంబ్లీకి వెళ్దామా ? వద్దా ? టీడీపీ ఎమ్మెల్యేల అంతర్మథనం..టీడీపీ ఆఫీసుకు భారీగా నేతల రాక

Babu (1)

AP TDP : ఏపీ అసెంబ్లీలో అడుగుపెడుదామా ? వద్దా ? అనే ఆలోచన చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. తాను సీఎం అయిన తర్వాతే..అసెంబ్లీలో అడుగు పెడుతానంటూ..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శపథం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రెస్ మీట్ లో భోరున విలపించారు బాబు. తర్వాత…ఆయన టీడీపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ తదనంతరం జరిగిన పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నారు.

Read More : AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ?

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భవిష్యత్ లో అసెంబ్లీకి వెళ్లాలా ? వద్దా ? అన్నదానిపై చర్చించారు. మరోసారి టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో..పాటు ప్రజాక్షేత్రంలోకి వెళితేనే బాగుంటుందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యోచిస్తున్నట్లు సమాచారం.

Read More : CM Jagan : బాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు – సీఎం జగన్

మరోవైపు మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయానికి భారీగా నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఇందులో మహిళా కార్యకర్తలు అధికంగా ఉండడం గమనార్హం. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ జెండా, మంత్రుల ఫొటోలను టీడీపీ మహిళా కార్యకర్తలు తగుబెట్టారు. తామంతా పార్టీతోనే ఉంటామని నేతలు వెల్లడించారు. మొత్తానికి ఏపీలో రాజకీయాలు హీట్ ను పెంచుతున్నాయి.