Chandrababu Naidu : కుప్పం పర్యటన షెడ్యూల్ ఖరారు.

మాజీ సీఎం కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఈ నెల 26 తేదీ కుప్పం వెళ్లనున్నారు. నాలుగు రోజులపాటు నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.

Chandrababu Naidu : కుప్పం పర్యటన షెడ్యూల్ ఖరారు.

Chandrababu Naidu

Chandrababu Naidu :  కుప్పంలో రాజకీయం వాడి వేడిగా ఉంది. గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం క్రమంగా వైసీపీ వశమవుతుంది. ఏ ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గంలో వైసీపీ తన మార్క్ చాటుకుంటుంది. తాజాగా విడుదలైన ఎంపీటీసీ ఫలితాల్లో చంద్రబాబు సొంతగ్రామం నారావారి పల్లెలో టీడీపీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలోనే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు టీడీపీ నేతలు.

చదవండి : Kodali Nani on Chandrababu: చంద్రబాబుపై కొడాలినాని తీవ్ర విమర్శలు

పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నారు. ఇక నియోజకవర్గంలోని పార్టీ నేతలను కలిసేందుకు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఈ నెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు చంద్రబాబు. పార్టీ పరిస్థితి, తీసుకోవలసిన చర్యలపై కార్యకర్తలతో చర్చించనున్నారు చంద్రబాబు.

చదవండి : Chandrababu : డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబు, లోకేష్, ఆ పత్రికలకు లీగల్ నోటీసులు